WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ద్వారకపేట రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను సోమవారం మున్సిపల్ ఛైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వేసవికాలంలో పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.