BHNG: పోచంపల్లిలోని స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నూతన సర్పంచులకు ఐదు రోజుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాజపేట మండల సర్పంచులు పాల్గొనగా, నిపుణులు గ్రామాభివృద్ధి, పరిపాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో జవాబుదారీతనం పెంచడం, నిధుల వినియోగంపై వీరికి శిక్షణ ఇవ్వనున్నారు.