MLG: తాడ్వాయి మండలంలోని మేడారానికి ఈరోజు భక్తులు తరలివచ్చారు. నేడు ఆదివారం కావడంతో గద్దెల వద్ద పూజలు నిర్వహిస్తున్నారు. చుట్టుపక్క ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకునేందుకు తరలివచ్చి, మొక్కలు చెల్లించుకుంటున్నారు. దర్శనాల అనంతరం చుట్టుపక్క ప్రాంతాల్లోని చెట్ల కింద వనభోజనాలు చేస్తున్నారు.