మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అమృత బార్ అండ్ రెస్టారెంట్లో కల్తీ బీర్ ఘటన కలకలం రేపింది. ఆదివారం బీర్ సీసాలో చెత్త కనిపించడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఒకే బాటిల్పై రెండు వేర్వేరు కంపెనీల పేర్లు ఉండటం అనుమానాలకు దారితీసింది. ఈ ఘటనపై ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా, బార్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.