HYD: యాకుత్పుర నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని పలు ఈద్గాలను సందర్శించారు. స్థానికంగా కొనసాగుతున్న ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం స్థానిక ముస్లింలతో మాట్లాడి పండుగ ఏర్పాట్లపై ఆరా తీశారు. ప్రత్యేక ఏర్పాట్లు చేయించినట్లు తెలిపారు. ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలన్నారు.