MBNR: జిల్లా కేంద్రంలోని రామ్ మందిర్ కాలనీకి చెందిన దాసు అనే వ్యక్తి నాలుగు నెలల క్రితం విద్యుత్ షాక్తో మృతి చెందారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.