HYD: చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న పలు కంపెనీలపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరబాద్లోని బుద్ధ భవన్లో రంగనాథ్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.