కృష్ణా: గుడివాడ బస్టాండ్లో సీపీఎం నేతలు శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొద్దిపాటి వర్షానికి బస్టాండ్ ఆవరణం చెరువులా మారి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తుందన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమిస్తామని వారు తెలిపారు.