KNR: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బొమ్మకల్ ఫ్లైఓవర్, ఆరెపల్లి, కృష్ణానగర్ ప్రాంతాల్లో పోలీసులు గురువారం దాడులు నిర్వహించి 70 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న మల్లేష్, లక్ష్మిపతి, స్వామిదాస్, సత్యనారాయణ, సత్తయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.