SRPT: ప్రతి ఇంట్లో తడి, పొడి చెత్తను వేరుచేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని ఛైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత, కమిషనర్ హనుమంతరెడ్డి కోరారు. శుక్రవారం సూర్యాపేట 42వ వార్డులో జరిగిన ‘ప్రజాపాలన-ప్రగతి పాలన’లో వారు పాల్గొన్నారు. చెత్తను రోడ్లు, డ్రైనేజీల్లో వేయడం వల్ల రోగాలు వస్తాయని, పరిశుభ్రత పాటించి వర్మి కంపోస్టును వినియోగించాలని సూచించారు.