KNR: శంకరపట్నం మండలం ఎరడపల్లి అంగన్వాడీ కేంద్రంలో ICDS సూపర్వైజర్ అరుణ ఆధ్వర్యంలో పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రజిత హాజరై ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార పథకాలు, అంగన్వాడీ సేవలను వినియోగించుకోవాలన్నారు. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, 0-5 ఏళ్ల పిల్లల బరువుల ప్రాముఖ్యతపై సూపర్వైజర్ వివరించారు.