సిరిసిల్ల పట్టణం శాంతినగర్ 2వ వార్డులో మహిళా సమైక్య సంఘాల సభ్యులకు వార్డు కౌన్సిలర్ వేముల రాములు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. మహిళల సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో సమైక్య సంఘాల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్పీలు గడ్డం జయ, మెరుగు చంద్రకళ, కొక్కుల అర్చనతో పాటు సమైక్య మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.