NZB: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు టూ టౌన్ ఎస్ఐ యాసిన్ అరాఫత్ బుధవారం తెలిపారు. మంగళవారం రాత్రి దారుగల్లీలో టూ టౌన్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో ఇబ్రహీం, జావిద్, మోసిన్, జియోదిన్, అమిరోద్దీన్, షబ్బీర్లను అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.17838 నగదును స్వాధీనం చేసుకున్నారు.