WGL: గీసుగొండ(M)కొమ్మాల గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఆదివారం నర్సంపేట మున్సిపల్ ఛైర్పర్సన్ పెండం శ్రీలక్ష్మీ-రామానంద్ భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.