RR: మియాపూర్లో ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ BRS శ్రేణులు సుభాష్ చంద్రబోస్ నగర్ నుంచి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. MLA స్వలాభం కోసం కాంగ్రెస్లో చేరి ప్రజా సమస్యలను గాలికొదిలేశారని, భూకబ్జాలకు పాల్పడుతున్న బినామీలకు అండగా ఉంటున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు.