NRPT: కృష్ణ మండల కేంద్రంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. గుడెబల్లూర్ శివారులో ఆదివారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్లను టాస్క్ ఫోర్స్, పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిపై ఏఎస్సై యాదయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.