ADB: జిల్లాలో గత ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు అన్నదాతకు తీరని నష్టం వాటిల్లిందని MLA పాయల్ శంకర్ అన్నారు. దీంతో పంట దిగుబడి తగ్గిపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో MLA పాయల్ శంకర్ మాట్లాడారు. ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలియజేశారు.