NLG: పెద్దఅడిశర్లపల్లి మండలం వద్దిపట్లలో ముత్యాలమ్మ విగ్రహానికి ఆ కాలనీ ప్రజలు భక్తి శ్రద్దలతో ఘనంగా విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. రానున్న రోజులలో గుడి నిర్మాణం చేసుకుని పెద్ద ఎత్తున జాతర కార్యక్రమాలు నిర్వహిస్తామని గ్రామ నాయకుడు దున్న ముత్యాలు అన్నారు. ఆ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ గ్రామంపై ఉండాలని అన్నారు. కార్యక్రమంలో దున్న ఆంజనేయులు పాల్గొన్నారు.