NZB: ధర్పల్లి మండలం సీతాయిపేట్ తండాకు చెందిన గిరిజన మహిళ కాంతామణి హత్య కేసు వివరాలను ఏసీపీ బీ.ప్రకాష్ స్వయంగా పరిశీలించారు. శనివారం ఘటన స్థలానికి చేరుకున్న ఆయన.. సీఐ బిక్షపతి, ఎస్సై శ్రీనివాస్ల నుంచి దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. అలాగే ఓన్నాజీపేట్ గ్రామంలో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు వివరాలను సమీక్షించారు.