SDPT: సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపడుతున్న నిరసన కార్యక్రమం బుధవారం నాటికి 16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చే వరకు ఈ నిరసన కార్యక్రమం కొనసాగిస్తామన్నారు. తమను విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.