MBNR: అడ్డాకల్ మండలం కందూరులోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం హుండీ లెక్కింపులో రూ.5.08 లక్షల ఆదాయం లభించినట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇటీవల నిర్వహించిన బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు సమర్పించుకున్నారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి భక్తుల రద్దీ పెరుగుతోందన్నారు.