KMR: జిల్లాలో తాజాగా విడుదలైన ఛార్టర్డ్ అకౌంటెంట్స్ (సీఏ) ఫైనల్ ఫలితాల్లో మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన సాయికుమార్ నీలావర్ ఉత్తీర్ణత సాధించారు. ఆయన తండ్రి మాజీ ఉప సర్పంచ్ మల్లికార్జున నీలావర్. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, పట్టుదలతో కృషి చేసి ఈ విజయాన్ని సాధించినట్లు సాయి తెలిపారు.