KMM: సత్తుపల్లి మండలం తుమ్మూరు శివారులోని ఒక కోళ్ల ఫారంలో ఆదివారం సుమారు 5,000 కోళ్లు మృతి చెందాయి. మరో రెండు రోజుల్లో చికెన్ దుకాణాలకు పంపించాల్సిన దశలో ఈ సంఘటన జరగడంతో రైతు ఆందోళన చెందుతున్నాడు. వర్షాలు తగ్గిన తర్వాత వైరస్ వ్యాపించి ఉండవచ్చని భావిస్తున్నారు. పశువైద్యాధికారులు పరిశీలన అనంతరం మాత్రమే దీనిపై స్పందించగలమని తెలిపారు.