KMR: ఉమ్మడి జిల్లా బాలబాలికల 44వ జూనియర్స్ ఖోఖో టోర్నీ జిల్లా కేంద్రంలో ఈనెల 17న నిర్వహించనున్నట్లు ఖోఖో అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఎండీ అతీఖుల్లా చెప్పారు. ఈ మేరకు శనివారం వివరాలను వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో టోర్నీ ఉంటుందన్నారు. 04-01-2008, ఆ తర్వాత జన్మించిన బాలబాలికలకు మాత్రమే అర్హులని ఆయన తెలిపారు.