NRML: మామడ మండలం పొన్కల్ గ్రామంలో 18 ఏళ్ల క్రితం పూడ్చివేతకు గురైన పురాతన కోనేరును గ్రామస్థులు, ఆలయ కమిటీ కలిసి పునరుద్ధరించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు, భక్తులు గోదావరి జలాలను తెచ్చి కోనేరులో పోసి పునఃప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక హోమం, కోనేరు హారతి వైభవంగా నిర్వహించగా, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని చాటారు.