ADB: బోథ్ మండల కేంద్రంలోని శ్రీ శివ మార్కండేయ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న వేద పండితుడు మేఘనాథ్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. ఆలయాల నిర్మాణాలతోనే ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని మేఘనాథ్ శర్మ పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.