KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం నుంచి ముత్తారం వైపు వెళ్తున్న ఓ సీడ్ కంపెనీకి చెందిన బొలెరో వాహనం బోల్తా పడింది. మార్గం మధ్యలో వాహనం అదుపుతప్పడంతో పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బొలెరో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. సీడ్ యాజమాన్యం బోల్తా పడ్డ వాహనాన్ని క్రేన్ సహాయంతో బయటకు తీసింది