GDWL: ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ అని గొప్పలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో రైతులకు అందుతోంది కేవలం 12 గంటలే అని కేటిదొడ్డి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గాజుల కృష్ణా పేర్కొన్నారు. బుధవారం కేడిదొడ్డి మండలం వెంకటాపురం సబ్స్టేషన్ను రికార్డులను పరిశీలించారు. నిరంతర విద్యుత్ బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ మాత్రమేనని, రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంటు అందించారన్నారు.