WGL: వరంగల్ బల్దియా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ డా. అశ్విని తానాజీ వాకడే 99 ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కారానికి శాఖాధికారులకు అప్పగించారు. ప్రజా సమస్యలపై శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ డా. రాజారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.