KRNL: జిల్లాలో ఈనెల 2న జరగనున్న డీఈఈ సెట్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈఓ శామ్యూల్ పాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9885716544 నంబర్కు ఫోన్ చేసి తెలపాలని కోరారు. హాల్ టికెట్లను apdeecet.apcfss.inవెబ్సైట్ నుంచి పొందొచ్చని చెప్పారు.