ASF: కాగజ్ నగర్ పట్టణం ESI శిథిలావస్థకు చేరింది. దీంతో కూల్చివేయాలని ఉత్తర్వులు కూడా వచ్చాయి. ప్రభుత్వం ESI కార్పొరేషన్ ఆస్పత్రికి స్థలం కేటాయించకవడం, నిధులు మంజూరు చేయకపోవడంతో ఇంకా శిథిల భవనంలోనే కొనసాగుతోంది. దీంతో కార్మికులకు వైద్యం అందని ద్రాక్షగానే మిగిలింది. రామగుండం తరలించేందుకు సన్నాహాలు చేస్తుండడంతో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.