MNCL: బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా చేపట్టనున్న విశాలమైన రహదారుల నిర్మాణానికి ప్రజలు, వ్యాపారులు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ శనివారం ప్రకటనలో కోరారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం అన్నారు. ఇరుకు రోడ్లు విశాలంగా అభివృద్ధి చెందితే రవాణా కష్టాలు తొలగిపోతాయన్నారు. శంకుస్థాపన జరిగిన రోడ్లు త్వరగా పూర్తి చేస్తామన్నారు.