NRML: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పీవీటీజీలు కోలాం, తోటిలు, చెంచులు, కొండరెడ్లు ఐటీడీఎ సీసీడీపీ ద్వారా నిర్మించుకున్న ఇండ్ల నిర్మాణ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను త్వరగా విడుదల చేయాలని ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. శనివారం హైదరాబాదులో ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్ కుమార్, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియను కలిసి వినతి పత్రం సమర్పించారు.