NRML: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువుకుంటే విజయం సాధిస్తారని ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు అడ్వాల శంకర్ అన్నారు. మస్కాపూర్ పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ విద్యార్థులను శాలువా కప్పి సన్మానించి అభినందించారు.