MHBD: BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ నందీనగర్లో గల కేసీఆర్ నివాసంలో ఆయనను కలిసి, ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు. ఇటీవల వైద్యపరీక్షల నిమిత్తం ఆయన యశోద ఆసుపత్రికి వెళ్ళిన విషయం తెలిసిందే.