ADB: ఆదిలాబాద్ జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ కోరారు. శనివారం హైదరాబాదులో రాష్ట్ర పాడి పరిశ్రమ శాఖ మంత్రి వాకాటి శ్రీహరిని ఆమె మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం ఆదిలాబాద్లో ఎక్కువగా గిరిజనులు ఉన్నారని వారి అభివృద్ధి కోసం పాడి పరిశ్రమకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆమె కోరారు.