KMM: అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించకుండా, అనర్హులకు కేటాయిస్తున్నారని, వైరా మున్సిపాలిటీ పరిధిలో రెండవ వార్డుకు చెందిన నిరుపేద మహిళలు మున్సిపాలిటీ కార్యాలయం నందు శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వలని ఆవేదన వ్యక్తం చేశారు.