MBNR: జడ్చర్ల పట్టణంలోని 7వ వార్డు బూరెడ్డిపల్లిలో మున్సిపాలిటీలో జనరల్ ఫండ్ రూ.4 లక్షల నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులను శనివారం మున్సిపల్ ఛైర్పర్సన్ కోనేటి పుష్పలత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ఉమాదేవి, మల్లె బోయినపల్లి సింగిల్ విండో ఛైర్మన్ పడాల మల్లేశ్, వార్డు అధ్యక్షుడు కరుణాకర్, వెంకటేశ్ కాలనీవాసులు పాల్గొన్నారు.