HNK: పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శాయంపేట మండలంలోని 23 మంది లబ్ధిదారులకు శనివారం ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వెంట ప్రజా ప్రతినిధులు, నేతలు ఉన్నారు.