ELR: కలెక్టరేట్లో 4 కరోనా కేసులు నమోదైనట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని డీఎంహెచ్వో మాలిణి శనివారం మీడియాకు తెలిపారు. సాధారణ మెడికల్ చెకప్లో భాగంగా సిబ్బంది కరోనా టెస్టులు చేయించుకోగా నెగిటివ్ వచ్చిందన్నారు. ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇద్దరికి, ముసునూరుకు చెందిన ఓ వృద్ధురాలికి కరోనా పాజిటివ్ వచ్చిందని, వారు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.