ATP: గుంతకల్లు పట్టణంలో ఆదివారం సాగునీటి సమస్యల పరిష్కార మార్గాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకాలంలో రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హంద్రీనీవా కాలువ సాగునీటి సమస్యలు త్వరగా పరిష్కరించాలన్నారు.