HNK: అంబాల గ్రామానికి చెందిన ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ గౌడ్కు రాష్ట్ర ప్రభుత్వం గ్యాలంట్రీ అవార్డును ప్రకటించింది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. ములుగు, భూపాలపల్లి, చిట్యాల, ఏటూరునాగారం, పెరూర్ వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ నిబద్ధతతో సేవలందించి గుర్తింపు పొందారు.