MBNR: ఉమ్మడి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న 18 మంది పోలీసు కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లు(హెచ్. సి)గా ఉద్యోగోన్నతి పొందినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు మంగళవారం జోగులాంబ జోన్ 7 డీఐజీ ఎల్. ఎస్. చౌహన్ తెలిపారు. వారిని డీఐజీ స్వయంగా అభినందించి, భవిష్యత్తులో మరింత ఉత్తమంగా సేవలందించాలని ఆకాంక్షించారు.