E.G: AP పేపర్ మిల్లు CSR ఫండ్స్ ద్వారా రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అధునాతన వైద్య పరికరాలు సమకూర్చారు. ఈ వైద్య పరికరాలను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా వైద్య సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే AP పేపర్ మిల్లు యాజమాన్యాన్ని అభినందించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు.