HNK: పరకాల పట్టణం 9వ వార్డులోని శ్రీనివాస కాలనీలో వర్షాకాలంలో దామెర చెరువు మత్తడి పడి నీరు చేరడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ మేరకు మాజీ కౌన్సిలర్ పూర్ణాచారి బుధవారం మున్సిపల్ కమీషనర్ వెంకటేష్కు వినతిపత్రం సమర్పించారు. గతంలో రూ.13 కోట్లతో మంజూరైన అట్టి నిర్మాణం అసంపూర్తిగా ఉందని, పారిశుధ్య పనులు తక్షణం పూర్తి చేయాలని కోరారు.