KKD: వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం నిర్వహిస్తున్న నేపథ్యంలో బుధవారం కాకినాడ ఆర్డీఓ కార్యాలయాన్ని పోలీసులు దిగ్బంధం చేశారు. వైసీపీ నాయకులెవరూ లోపలికి రాకుండా కార్యాలయం గేట్ నుంచి ఆర్డీఓ ఛాంబర్ వరకు పూర్తిగా పోలీసులు మోహరించారు. వైసీపీ దుందుడుకు చర్యలకు పాల్పడుతుందన్న ముందస్తు సమాచారం మేరకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.