ASR: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. జూన్ 4న జరిగే వెన్నుపోటు దినంకు సంబంధించి ఆదివారం హుకుంపేటలో వైసీపీ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. వైసీపీ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూన్ 4న వెన్నుపోటు దినంగా ప్రకటించారన్నారు.