JGL: ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో అదివారం పిట్టల వెంకటేష్ ఏర్పాటు చేసిన భారత్ పెట్రోల్ బంక్ను టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు, మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కూన గోవర్ధన్, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం వాహనదారులకు స్వయంగా పెట్రోల్ డీజిల్ పోశారు. బంకు నిర్వాహకులు సుజిత్ రావు, గోవర్ధన్లను శాలువా పూలమాలతో సత్కరించారు.