KMM: ముదిగొండలో ఆదివారం మండల మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. మండల అధ్యక్షుడిగా చెరుకూరి ఉపేందర్, ఉపాధ్యక్షులుగా సాదినేని సత్య నారాయణ, యలమందల సాయి, కార్యదర్శిగా గొట్టెముక్కల ఉపేందర్, జాయింట్ సెక్రటరీగా రాయపాటి సతీష్, ట్రెజరరీ వెంపటి రమేష్ ఎన్నికయ్యారు. మున్నూరు కాపు సంఘం కోసం నిరంతరం పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు.