ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన భైరవకోనలో భక్తులు సందడి చేశారు. ఆదివారం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున భైరవకోనకు చేరుకొని సుందరమైన జలపాతంలో స్నానాలు ఆచరించి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం త్రిముఖ దుర్గాదేవి, నాగబైరేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ భక్తులకు వసతులు సమకూర్చారు.